SAKSHITHA NEWS

Tribute to Ramoji with Megastar Chiranjeevi

అక్షరయోధుడు “రామోజీ రావు”

మెగాస్టార్ చిరంజీవితో కలిసి రామోజీకి నివాళులర్పించిన టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు

హైదరాబాద్ ( ) మీడియా దిగ్గజం, ప్రముఖ పారిశ్రామిక వేత్త రామోజీ రావు మృతి తెలుగు రాష్ట్రాల ప్రజలకు తీరనిలోటని టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు సంతాపం వ్యక్తం చేశారు. రామోజీ ఫిలింసిటీలో మెగాస్టార్ చిరంజీవి తదితర సినీ ప్రముఖులతో కలిసి రామోజీరావు పార్దివదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అలు పెరుగని అక్షర యోధుడు రామోజీరావు జనహితమే తన అభిమతంగా అనుకున్నారనీ జీవితాంతం నిబద్ధతతో పనిచేశారని పేర్కోన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు స్ఫూర్తితో పనిచేశారు అని‘తెలుగు పత్రికా రంగంలో రామోజీరావు మకుటం లేని మహారాజనీ పత్రికా రంగంలో కొత్త ఒరవడి సృష్టించారనీ, భావితరాల పత్రికా ప్రతినిధులకు మార్గదర్శిగా నిలిచారని అభినందించారు. చిత్రసీమ అభివృద్ధికి నిర్మాతగా సహకరించారని అదేవిధంగా తెలుగు నేలపై అతిపెద్ద స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మించారని, రామోజీరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఆయన ఆత్మకు శాంతి కలుగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాని నాగాసీతారాములు అన్నారు.


SAKSHITHA NEWS