SAKSHITHA NEWS

Transfers of Sub Inspectors in Multi Zone

హైదరాబాద్:జూన్ 14
మల్టీ జోన్ వన్ పరిధిలో పనిచేస్తున్న నలుగురు సబ్ ఇన్ స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఇన్‌స్పెక్ట‌ర్‌ జనరల్ ఆఫ్ పోలీస్ ఐజీ, ఏవీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇంటలిజెన్స్ నుంచి రిప్యాట్రి యేషన్ అయిన ఏ. నిరంజ న్ రెడ్డిని సుల్తానాబాద్ సర్కిల్ కు, సుల్తానాబాద్‌లో పనిచేస్తున్న గొట్టం సుబ్బా రెడ్డిని, ఐజీ కార్యాలయా నికి, ఏసీబీ నుంచి రిప్యాట్రి యేషన్ అయిన ఏ. వెంకట రాజా గౌడ్ రామాయణపేట సర్కిల్ కు బదిలీచేశారు.

రామాయంపేటలో పని చేస్తున్న బి. వెంకటేష్ ను ఐజీ కార్యాలయానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రానున్న రెండు మూడు రోజుల్లో మరిన్ని బదిలీలు జరిగే అవకాశా లున్నాయి…


SAKSHITHA NEWS