నిరక్షరాస్యత నిర్మూలన : వాలంటీర్లకు శిక్షణ కార్యక్రమం

Sakshitha news

నిరక్షరాస్యత నిర్మూలన : వాలంటీర్లకు శిక్షణ కార్యక్రమం
సాక్షిత : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట మండల పరిధిలో
తెలంగాణ ప్రభుత్వం నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు ఉల్లాస్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా ఎంపిక చేసిన ఉపాధ్యాయులు, విలేజ్ ఆర్గనైజర్లకు (వీవో) అక్షరాస్యతా కార్యచరణపై స్థానిక జిల్లా పరిషత్ బాలి కోన్నత పాఠశాలలో శిక్షణ ఇచ్చారు. అశ్వారావుపేట మండలంలో 30 గ్రామ పంచాయితీల నుండి ఒక్కో పంచాయతీకి ఒక ఉపాధ్యాయుడు, ఒక వీవో చొప్పున శిక్షణ పొందారు. ఈనెల 28న వీరు గ్రామస్థాయిలో వాలంటీర్లకు శిక్షణ ఇస్తారు.