SAKSHITHA NEWS

తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేగింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్‌ రోడ్డులో చిరుత కనిపించింది. ఇవాళ తెల్లవారుజామున భక్తుల కారుకు అడ్డుగా వచ్చింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ నేప‌థ్యంలో భ‌క్తులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, కాలిన‌డ‌క‌న తిరుమ‌ల‌కు వెళ్లే మెట్ల మార్గంలో భ‌క్తులు గుంపులుగా వెళ్లాల‌ని అధికారులు సూచించారు.


SAKSHITHA NEWS