SAKSHITHA NEWS

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఏపీకి చెందిన ముగ్గురు దుర్మరణం

హైదరాబాద్:
అమెరికాలో ఘోరరోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన ముగ్గురు మరణించారు. రెండు వాహనాలు ఢీకొన్నడంతో ఈ ప్రమాదం జరిగింది.ఈ ఘటనలో ముగ్గురు మరణించగా..మరో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.

దక్షిణ బాన్ హామ్ కు ఆరు మైళ్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. మరణించినవారిలో ఒకరిది తిరుపతి జిల్లా కాగా మరో ఇద్దరిది శ్రీకాళహస్తిగా తెలుస్తోంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రాండాల్ఫ్ సమీపంలో సాయంత్రం ఈ ఘటన జరిగింది.

ఐదుగురు ఎన్ఆర్ఐలు ప్రాణాలు కోల్పోగా..వీరిలో ఒక మహిళ సహా ముగ్గురు ఏపీలోని ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందినవారు ఉన్నట్లు గుర్తించారు.


SAKSHITHA NEWS