A terrible accident.. Both legs of the woman were crushed
ఘోర ప్రమాదం.. మహిళ రెండు కాళ్లు నుజ్జునుజ్జు
ఆర్టీసీ బస్సు చక్రాల కింద నలిగి ఓ మహిళ రెండు కాళ్లు నుజ్జునుజ్జు అయ్యాయి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బస్టాండ్లో ఆర్టీసీ బస్సు వెనక్కి తీస్తున్న క్రమంలో సుజాత (50) అనే మహిళ బస్సు ఆపమంటూ వెనక నుండి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ మహిళను డ్రైవర్ గమనించకపోవడంతో బస్సు వెనక చక్రాలు ఆమె రెండు కాళ్లపై నుండి వెళ్లాయి. దీంతో ఆమె రెండు కాళ్ళు నుజ్జునుజ్జు అయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మహిళను ఆస్పత్రికి తరలించారు.
![ఘోర ప్రమాదం.. మహిళ రెండు కాళ్లు నుజ్జునుజ్జు 2 WhatsApp Image 2024 06 13 at 13.01.19](https://sakshithanews.com/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-13-at-13.01.19.jpeg)