SAKSHITHA NEWS

వీరులపాడు గ్రామంలో “గడపగడపకు- మన ప్రభుత్వం” కార్యక్రమం నిర్వహించిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..

ప్రతి అడుగులోనూ పేదవాడికి మంచి జరగాలన్నదే వైయస్ జగన్ ధ్యేయం : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..

లంచాలు, వివక్ష లేకుండా సుపరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..

మండలంలోని “వీరులపాడు” గ్రామంలో గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల బుక్ లెట్ లను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ప్రజలకు అందజేశారు ..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పునాదులు ప్రజల పట్ల ప్రేమలోంచి పుట్టాయని.. పేదల కోసం తీసుకువస్తున్న విద్యా విప్లవంలో, వాళ్లకు ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో, వారి కోసం కట్టిస్తున్న ఇళ్లల్లో, గ్రామాల్లో ఎటువంటి లంచాలు, వివక్ష లేకుండా అక్కచెల్లెళ్లకు, రైతన్నలకు, అవ్వా తాతలకు, పిల్లలకు మంచి జరిగేలా అందిస్తున్న సేవల్లో వైయస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన తీరు కనబడుతుందని చెప్పారు.

నాలుగేళ్ల పాలనలో చేసిన మంచే వైయస్ జగన్ బలమని.. ఇదే జగన్ నినాదమని తెలిపారు. చంద్రబాబు పాలనను – వైయస్ జగన్ పాలనను బేరీజు వేసి తేడాను ప్రజలు గమనించాలని.. తెలుగుదేశం హయాంలో అధికారం అంటే దోచుకోవటం, పంచుకోవటం, తినుకోవడం అని.. అప్పుడు ఇప్పుడు అదే రాష్ట్రం, అదే బడ్జెట్, మారిందల్లా కేవలం జగన్ మాత్రమేనని.. మరి వాళ్ళు ఎందుకు ఈ సంక్షేమ కార్యక్రమాలు చేయలేకపోయారో.. వైయస్ జగన్ ఎందుకు అమలు చేయగలుగుతున్నాడు అనేది ప్రజలు తెలుసుకోవాలన్నారు. ప్రజలకు మంచి జరుగుతుంటే చంద్రబాబుది ఓర్వలేని తనమని ఎద్దేవా చేశారు. ప్రజలంతా ఏకతాటిపై వచ్చి వైయస్ జగన్ ను మరో మారు ముఖ్యమంత్రి గా చేయటానికి సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు ..

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు ..


SAKSHITHA NEWS