SAKSHITHA NEWS

  • ప్రభుత్వంమల్టీ పర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలి.

దసరా లోపే పెండింగ్ జీతాలు చెల్లించా లని

సిఐటియు జిల్లా అధ్యక్షులు మండ్ల రాజు డిమాండ్

*సాక్షిత వనపర్తి :

గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ & వర్కర్స్ సమస్యలను పరిష్కరించాలని అలాగేమల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని కోరుతూ వనపర్తి జిల్లా సిఐటియు ఆధ్వర్యంలో మర్రికుంట పాల కేంద్రం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి న అనంతరం. ఏవో భాను ప్రకాష్ కి వినతి పత్రం అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు మండ్ల రాజు మాట్లాడుతూ. దసరా దీపావళి పండుగలు ఉన్న గ్రామపంచాయతీ కార్మికులకు మూడు నాలుగు నెలల నుండి జీతాలు బకాయిలు ఉన్నాయని. పండుగకు కూడా జీతాలు రాకపోతే వారు ఎలా పండుగలు చేసుకోవాలని ప్రశ్నించారు. ఇచ్చే జీతాలు తక్కువ పైగా నెలల తరబడి జీతాలు బకాయి ఉండడంతో కార్మికులు ఇల్లు గడవడానికి పిల్లల చదువుల తో పాటు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే దసరా లోపల జీతాలు చెల్లించాలని. మల్టీ పర్పస్ విధానం రద్దు చేయాలని. బట్టలు సబ్బులు నూనెలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో అన్ని రకాల పనులు చేస్తూ గ్రామాలను పరిశుభ్రతకు పచ్చదనానికి నిలయంగా నిలుపుతున్న కార్మికులకు నెలల తరబడి జీతాలు రాకపోవడం దారుణమని.

కార్మికుల కష్టాన్ని ప్రభుత్వం గుర్తించడం లేదని. కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని జీతాలు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే కార్మికులపై పని భారం తగ్గించాలని వేధింపులు ఆపాలని. ప్రమాదంలో చనిపోయిన కార్మికులకు వారి కుటుంబంలో ఉద్యోగం ఇచ్చి 25 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.. జీవో నెంబర్ 51 సవరించాలని. వారంతపు సెలవులు పండుగ సెలవులు ఇవ్వాలని. పిఎఫ్ ఇఎఫ్సి ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి సూర్యవంశం రాము. సిఐటియు జిల్లా నాయకులు. నందిమల్ల . రాములు మధు గ్రామపంచాయతీ యూనియన్ జిల్లా అధ్యక్షులు హనుమంతు నాయక్ జిల్లా కోశాధికారి పుష్ప శీను దాసు వెంకటేష్ లక్ష్మన్న రాజు నారాయణ శ్రీను కురుమయ్య జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS