SAKSHITHA NEWS

డాక్టర్ మౌనిత పై అత్యాచారం చేసి హత్య చేసిన దోషులను ‌ ఉరితీయాలి

-సామాజిక కార్యకర్త రుక్కు సయ్యద్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ

రాజమహేంద్రవరం, సాక్షిత,

కోల్ కత్తా లో డాక్టర్ మౌమిత ఘటనపై దోషులను తక్షణం ఉరిశిక్ష విధించాలని కోరుతూ సామాజిక కార్యకర్త రుక్కు సయ్యద్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఆదివారం రాత్రి రాజమండ్రి పుష్కర్ ఘాట్ వద్ద ప్రముఖ న్యాయవాది పద్మావతి భావరాజు, బిజెపి మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి అధికార లక్ష్మి, ప్రముఖ న్యాయవాది వైఎస్ఆర్సిపి లీగల్ సెల్ నాయకురాలు అంగర సత్యప్రియ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
తక్షణం దోషులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

కోల్ కత్తాలో డాక్టర్ మౌమిత పై జరిగిన అత్యాచారం, హత్యను యావత్ దేశమంతా తీవ్రంగా ఖండించాలని డిమాండ్ చేశారు. ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు కలిగి ఒక డాక్టర్ గా సమాజానికి ఎంతో విలువైన సేవలు అందించాల్సిన మౌమిత జీవితం ఈ విధంగా ముగిసిపోవడం చాలా బాధాకరం హృదయ విధాయకరమన్నారు. ఈ దుర్మార్గానికి ఒడిగట్టిన వారిని కఠినంగా శిక్షంచాలని, వెంటనే దర్యాప్తు జరిపి దోషులను కఠినంగా శిక్షించి, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలేజీ విద్యార్థులు విద్యార్థులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

WhatsApp Image 2024 08 19 at 16.16.10

SAKSHITHA NEWS