బీజేపీ రాష్ట్ర అధ్యక్షునికి ఘన స్వాగతం

Sakshitha news

బీజేపీ రాష్ట్ర అధ్యక్షునికి ఘన స్వాగతం

సాక్షిత ప్రతినిధి – తిరుపతి: బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తిరుపతి పర్యటనకు విచ్చేసిన సందర్బంలో ఆపార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. తిరుపతి కచపి ఆడిటోరియంలో బీజేపీ నిర్వహించిన “సారధ్యం” అవగాహన సభకు మాధవ్ హాజరై బీజేపీ శ్రేణులకు కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. స్వాగతం పలికిన వారిలో బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, చంద్రగిరి నియోజకవర్గ ఇన్ చార్జి మేడసాని పురుషోత్తం నాయుడు, రాష్ట్ర కార్యనిర్వాహాక కార్యదర్శి గుండాల గోపినాథ్ రెడ్డి, సీనియర్ నేత పి.నవీన్ కుమార్ రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ వరప్రసాద్, లీగల్ సెల్ అజయ్ కుమార్, మహిళా మోర్చా నాయకురాళ్లు గాలి పుష్పలత, అనూష తదితరులు ఉన్నారు.