SAKSHITHA NEWS

ప్రకాశం జిల్లా,
పెద్దదోర్నాల లో స్థానిక నటరాజ్ కూడలి లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు, బట్టు సుధాకర్ రెడ్డి, రావిక్రింది సుబ్బరత్నం ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించారు, స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు, ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బట్టు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు,స్వర్గీయ నందమూరి తారక రామారావు మార్చి 29వ తేదీ 1982 వ సంవత్సరంలో స్థాపించారని నాటి నుండి నేటి వరకు ఈ 41 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పార్టీకి వెన్నుదన్నుగా ఉండి పార్టీని విజయ పదం వైపు నడిపించి అన్ని విధాల వారి సహాయ సహకారాలు అందించారని ప్రతి తెలుగుదేశం కార్యకర్తకు కృతజ్ఞతలు తెలియజేశారు,

అదేవిధంగా రావి క్రింది సుబ్బరత్నం మాట్లాడుతూ పార్టీకి కార్యకర్తలు వెన్నెముక లాంటి వారిని ఇదే ఉత్సాహంతో రాబోవు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో షేక్ మాబు,
దేషు నాగేంద్రబాబు, జెడి లక్ష్మయ్య, ఈదర మల్లయ్య, దొడ్డ శేషాద్రి, చిన్న వెంకటేశ్వర్లు (చంటి) ఖాన్, విష్ణు, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS