SAKSHITHA NEWS

తెలంగాణ గురుకుల మైనారిటీ జూనియర్ కళాశాల జగిత్యాల.

జూనియర్ కళాశాలలో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి వేడుకలు

తెలంగాణ మైనారిటీ గురుకుల జూనియర్ కళాశాలలో ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మరియు జగిత్యాల రాజన్న సిరిసిల్ల యొక్క రీజినల్ లెవెల్ కోఆర్డినేటర్ డాక్టర్ దాసరి రాజేందర్ గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ విద్యార్థులు గురువుల పట్ల అధిక గురుభక్తిని కలిగి ఉండి శ్రద్ధ భక్తులతో విద్యాభ్యాసం చేయాలని సూచించారు.
విద్యార్థులు చిన్నప్పటి నుంచి వారికి గురువుల పట్ల కలిగి ఉన్నటువంటి భక్తిశ్రద్ధలను ఈ కార్యక్రమంలో నెమరు వేసుకున్నారు.
ఇంటర్ మొదటి మరియు రెండవ సంవత్సరం విద్యార్థులు ఉపన్యాసకులకు శాలువా చేత సత్కరించారు
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఎన్ మహేందర్, శ్రవణ్ కుమార్, జగన్ మహేష్, నవీన్, తిరుపతి, అపర్ణ, ప్రకాష్, విజయ్, ఇమ్రాన్లు పాల్గొన్నారు


SAKSHITHA NEWS