SAKSHITHA NEWS

youth యువతకు స్ఫూర్తి స్వామి వివేకానందుడు: వివేకానంద రైసింగ్ సొసైటీ అధ్యక్షుడు కుమ్మరి రాజు

సాక్షిత : మందలో ఒకరిగా ఉండకు,వందలో ఒకరిగా ఉండడానికి ప్రయత్నించు, బద్ధకమే అసలు పాపం:అదే పేదరికానికి కారణం..

youth అనే ఇలాంటి వందల సూక్తులతో ఎంతో మంది యువతను పేరేపరించి,యువతకు రోల్ మోడల్ గా నిలిచిన స్వామి వివేకానంద 122 వ వర్ధంతి సందర్భంగా,వివేకానంద రైసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో మల్కాజిగిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ 141 డివిజన్ పరిధిలోని వీధి నెంబర్ 28 లో గల స్వామి వివేకానంద విగ్రహానికి వివేకానంద రైసింగ్ సొసైటీ సభ్యులు పూలమాలలువేసి నివాళులు అర్పించడం జరిగింది.

ఈ సందర్భంగా వివేకానంద రైసింగ్ సొసైటీ అధ్యక్షుడు కుమ్మరి రాజు మాట్లాడుతూ భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసిన మహాపురుషుడు స్వామి వివేకానందుడు అని అన్నారు.

ఈ తరం యువకులు అంతా స్వామి వివేకానందుడిని స్ఫూర్తిగా తీసుకొని దేశ ప్రజా సేవకు తోడ్పడాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో కుమ్మరి రాజు, నితిన్ కుమార్, అఖిల్, వినయ్, ప్రశాంత్, లలిత, లచ్చయ్య , తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
download app

youth

SAKSHITHA NEWS