భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ నలుమూలల చాటిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద
విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
సాక్షిత వనపర్తి
వివేకానంద జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం వనపర్తి పట్టణంలోని వివేకానంద చౌరస్తాలో నిర్వహించిన వేడుకల్లో వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డ పాల్గొన్నారు
ఈ సందర్భంగా స్వామి వివేకనంద విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులు అర్పించారు
ఈ సందర్భంగా
స్వామి వివేకానంద జయంతిని యువజన దినోత్సవం గా జరుపుకుంటారని, యువకులు ఆయన ఆశయాల సాధన కోసం కృషి చేయాలన్నారు
కార్యక్రమంలో వివేకానంద జిల్లా కమిటీ సభ్యులు కోటేశ్వర్ రెడ్డి భాను ప్రసాద్ పిచ్చయ్య రాజశేఖర్ రెడ్డి రామకృష్ణ గౌడ్, వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వాకిటి ఆదిత్య, కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షులు చీరల చందర్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బి కృష్ణ, వనపర్తి పట్టణ ప్రముఖ వైద్యులు పగిడాల శ్రీనివాస్, వనపర్తి పట్టణ మాజీ కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
