SAKSHITHA NEWS

72 కేసుల్లో మద్యం నిర్వీర్యం చేసిన సూర్యాపేట పట్టణ పోలీసులు.

గత సంవత్సర కాలంలో ఎన్ఫోర్స్మెంట్ లో పట్టుబడిన మద్యం.

సాక్షిత న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి : డిప్యూటీ కమీషనర్ ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ నల్గొండ వారి ఉత్తర్వుల మేరకు ఎక్సైజ్ సూపరింటెండెంట్ అధ్వర్యంలో పట్టణ సీఐ ,ఎస్సై పట్టణ పోలీసులు, ఎక్సైజ్ పోలీసులు మద్యాన్ని సూర్యాపేట పట్టణ పోలీసు స్టేషన్ వెనకాల క్రింద పోసి నిర్వీర్యం చేశారు. జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు ఎక్సైజ్ శాఖ వారి ఉత్తర్వుల మేరకు 72 కేసుల్లో మద్యం బాటిళ్లను పగులగొట్టి నిర్వీర్యం చేశాం అని పట్టణ CI రాజశేఖర్ తెలిపినారు. దీని విలువ అందాజుగా 2.5 లక్షలు విలువ ఉంటుంది అని CI అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ లక్ష్మ నాయక్ ఉన్నారు.


SAKSHITHA NEWS