SAKSHITHA NEWS

సూర్యాపేట-రాజమండ్రి వరకు నేషనల్ హైవే

తెలుగు రాష్ట్రాల మధ్య మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. సూర్యాపేట నుంచి కూసుమంచి, ఖమ్మం, వైరా, తల్లాడ, సత్తుపల్లి, అశ్వారావుపేట, జీలుగుమిల్లి, బుట్టాయగూడెం మీదుగా పోలవరం వద్ద పట్టిసీమను కలిపేలా 2 వరుసలుగా ఉన్న ఈ రహదారిని 4 రహదారులుగా విస్తరించనున్నారు. 86.5 KM మేర విస్తరణ జరగనుండగా.. 40.42 KM మేర తొలి ప్యాకేజీని రూ.367.97 కోట్లతో నిర్మించనున్నారు. జనవరి నెలాఖరులో పనులు ప్రారంభం కానున్నాయి.


SAKSHITHA NEWS