చిలకలూరిపేట మండల విద్యాశాఖ అధికారిని కలిసిన ఎస్టియు నాయకులు
నూతనంగా ఎంఈఓ బాధ్యతలు చేపట్టిన బి.సత్యనారాయణ సింగ్ గారిని చిలకలూరిపేట మండల మరియు పట్టణ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం నాయకులు కలిసి ఉపాధ్యాయుల పక్షాన శాలువా తో అభినందనలు తెలియజేయడం జరిగింది. ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం సమర్పించడం జరిగింది
మున్సిపల్ మరియు మండల పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల ఎస్ఆర్లు సర్వీస్ రిజిస్టర్లు అప్డేట్ చేయాలని
ఉపాధ్యాయుల ఎరియర్ బిల్స్ సరెండర్ లీవ్ బిల్స్ ఏపీ బిల్స్ త్వరగా మంజూరు చేయాలని
వేసవి సెలవుల్లో చేసిన సంపాదిస్తావులను సర్వీస్ రిజిస్టర్లో నమోదు చేయాలని
చిలకలూరిపేట నుంచి బదిలీ అయిన ఉపాధ్యాయుల సర్వీస్ రిజిస్టర్ అప్డేట్ చేసి వారికి అందించాలని
24 సంవత్సరాల స్కేల్ కోసం అప్లై చేసుకుని పెండింగ్ ఉన్న ఉపాధ్యాయునుల స్కేల్ వెంటనే మంజూరు చేయాలని ప్రతినిధించి చేయడం జరిగింది . మండల విద్యాశాఖ అధికారి స్పందిస్తూ తక్షణమే ఈ సమస్యలు పరిష్కారం చేస్తానని తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా మున్సిపల్ ఉపాధ్యాయులు మండల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు సమిష్టిగా మండల స్థాయిలో కృషి చేయాలన్నారు
