ఎస్ టి యు చిలకలూరిపేట ఏరియా వార్షిక కౌన్సిల్ సమావేశం
చిలకలూరిపేట మంగళవారం ది:18 11 2025 సాయంత్రం 4:00 గం||లకు ఎస్ టి యూ ప్రాoతియ కార్యాలయంలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం చిలకలూరిపేట, నాదెండ్ల, ఎడ్లపాడు మండలాల మరియు చిలకలూరిపేట పట్టణ వార్షిక కౌన్సిల్ సమావేశం జరుగుతుందని ఎస్టీయూ ఏరియా కార్యదర్శి వినుకొండ అక్కయ్య తెలిపారు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కే కోటేశ్వరరావు రాష్ట్ర డైరీ కన్వీనర్ పోటు శ్రీనివాసరావు జిల్లా అధ్యక్షులు శ్రీ ఎల్వి రామిరెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి యు చంద్రజిత్ యాదవ్ పాల్గొంటారు కావున ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు ఈ వార్షిక కౌన్సిల్ సమావేశంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో నూతన కార్యవర్గ ఎన్నికలు, ఉపాధ్యాయుల అపరిషకృత సమస్యలు, పాఠశాల పరిరక్షణ కై తీసుకోవలసిన చర్యలు, ఉపాధ్యాయ సమస్యలపైఉద్యమ కార్యచరణ పై చర్చించడం జరుగుతుంది కావున ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఎస్టీయు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరుతున్నామని తెలిపారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
