SAKSHITHA NEWS

గణేశ్ నిమజ్జనానికి పటిష్టమైన బందోబస్తు : జిల్లా ఎస్పీ రావుల గిరిధర్,
గణేష్ శోభాయాత్ర వెళ్ళే మార్గాల్లో సి.సి కెమెరాల ఏర్పాట్లు.*


సాక్షిత వనపర్తి :
గణేశ్ నిమర్జనమునకు పకడ్బందీ చర్యలను చేపట్టామని, అందరూ ప్రశాంత నిమర్జనమునకు సహకరించాలని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ కోరారు. వనపర్తి పట్టణo లో గణేష్ శోభాయాత్ర వెళ్ళే మార్గంలు అయిన మర్రికుంట కొత్త బస్టాండ్ పాలిటెక్నిక్ కాలేజ్ రాజీవ్ చౌక్ అంబేద్కర్ చౌక్ గాంధీ చౌక్ చింతల్ హనుమాన్, నిమర్జనం జరిగే నల్లచెరువు చెరువు ప్రాంతాలను ఎస్పీ పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… పోలీసు వారి యొక్క సూచనలకు అనుగుణముగా నిర్వాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులు నడుచుకొని ప్రశాంతముగా నిమర్జనం పూర్తి అయ్యేలా సహాయ సహకారాలు అందించాలని కోరారు. నిమర్జనం ప్రశాంత వాతావరణం లో పూర్తి అయ్యేలా భద్రత పరమైన అన్ని చర్యలను చేపట్టామని, అవసరమైన ప్రాంతాలలో సిసి కెమెరాలను, వీడియోగ్రఫీ ఏర్పాటు చేశామని, స్థానిక గజ ఈతగాళ్లును నిమర్జన ప్రాంతములో, క్రేన్ అందుబాటులో ఉంచమని, శోభాయాత్ర వెళ్ళేమార్గం లో ఇతర శాఖ ల యొక్క సమన్వయము తో ఎటువంటి అవాంతరములు తలెత్తకుండా పటిష్టమైన చర్యలను తీసుకుంటున్నామని తెలిపారు. నిమజ్జనం సందర్భంగా డీజే లు, సౌండ్ సిస్టంలు,బాణాసంచా కాల్చడం వంటివి చేయరాదని తెలిపారు. ముఖ్యంగా యువకులు నిమజ్జనం సమయంలో సంయమనం పాటించాలని ఊర్లలోని పెద్దలు పిల్లలకు తెలియజేసి ఆదర్శంగా నిలవాలని తెలిపారు. చట్టాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని, చట్టానికి లోబడి నడుచుకోవాలని తెలిపారు. చట్టానికి విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తించిన వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వినాయక నిమజ్జను శాంతియుతంగా, సామరస్యంగా జరుపుకోవాలని అందుకు ప్రజలు పూర్తిగా పోలీసులకు సహకారం అందించాలని కోరారు.

జిల్లా ఎస్పీ వెంట మున్సిపల్ కమిషనర్ శ్రీ పూర్ణ చందర్ , మున్సిపల్ డి ఈ యూనిస్ , వనపర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగభూషణం, టౌన్ ఎస్ఐ జయన్న మరియు ఇతర అధికారులు, సిబ్బంది ఉన్నారు.


SAKSHITHA NEWS