SAKSHITHA NEWS

చందిప్ప శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో సీరియల్ యాక్టర్ లక్ష్మి పూజలు

శంకరపల్లి :శంకర్‌పల్లి మండల పరిధిలోని చందిప్ప గ్రామ శివారులో గల 11 వ శతాబ్దానికి చెందిన శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో మంగళవారం సీరియల్ యాక్టర్ లక్ష్మి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధాన పూజారి సాయి శివ ఆమెకు తీర్థప్రసాదాలు అందజేశారు. మరకత లింగాన్ని దర్శించుకోవడం తన జన్మ ధన్యమైందని ఆమె అన్నారు. ఆల్ ఇండియా చైర్మన్ దయాకర్ రాజు ఆలయ చైర్మన్ గోపాల్ రెడ్డి, సదానందం గౌడ్ ఆమెకు స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు.


SAKSHITHA NEWS