శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని 92 దేవాలయంలకు మంజురైన

Sakshitha news

శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని 92 దేవాలయంలకు మంజురైన రూ.30,71,000/- ముప్పై లక్షల డెబ్భై ఒక వెయ్యి రూపాయల ఆర్థిక సహాయంను అందచేసిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

తెలంగాణ రాష్ట్ర సంస్కృతి ,సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల పర్వదినం సందర్భంగా ప్రజలందరికి బోనాల పర్వదిన శుభాకాంక్షలు… బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో అంగరంగా వైభవంగా, ఘనంగా నిర్వహించుకుందాం

PAC చైర్మన్ ఆరెక పూడిగాంధీ

తెలంగాణ రాష్ట్ర సంస్కృతి ,సంప్రదాయాలకు ప్రతీక అయిన ఆషాఢ మాస బోనాల పర్వదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని 92 దేవాలయంలకు మంజురైన రూ.30,71,000/- ముప్పై లక్షల డెబ్భై ఒక వెయ్యి రూపాయల ఆర్థిక సహాయం ను EO సత్యనారాయణ , తాజా మాజీ కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్ , ఉప్పలపాటి శ్రీకాంత్ , సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి తో కలిసి ఆలయ ధర్మకర్తలకు అందచేసిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ తెలంగాణ ఆత్మగౌరవానికి, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే ఆషాఢ మాస బోనాల మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవడానికి నిధులు మంజూరి చేయడం చాలా సంతోషకరమైన విషయం అని PAC చైర్మన్ గాంధీ అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని మతాలను సమానంగా చూస్తున్నారు అని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద మనస్సు తో ఈ ఏడాది బోనాల ఉత్సవాల కోసం రూ.20 కోట్ల నిధులు మంజూరి చేయడం జరిగినది అని, మన శేరిలింగంపల్లి నియోజకవర్గంలో గల 92 దేవాలయాలకు గాను రూ. 30,71,000/- రూపాయలు మంజూరి అయినవి అని, ఆలయాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అని, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, వైద్య సదుపాయాలు వంటి అన్ని ఏర్పాట్లను సమన్వయంతో అమలు చేయడం జరుగుతుంది అని, మన సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుంది. ప్రతి భక్తుడు అమ్మవారి ఆశీస్సులతో ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో బోనాల ఉత్సవాలను జరుపుకునేలా అన్ని శాఖలు సమిష్టిగా పనిచేయాలని అధికారులకు PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు.

బోనాలను అంగరంగా వైభవంగా నిర్వహించుకోవడానికి నిధులు ఎంతగానో ఉపయోగపడుతాయి అని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నామని, అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగినది అని, ప్రశాంత వాతావరణంలో బోనాలు నిర్వహించుకోవడానికి ఏర్పాట్లు చేయడం జరిగినది అని PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు.

ఈ కార్యక్రమంలో నాయకులు ,కార్యకర్తలు, ఆలయ ధర్మ కర్తలు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top