SAKSHITHA NEWS

డబుల్ బెడ్‌రూమ్‌ పేరిట రూ.20 లక్షల మోసం

ఫోర్జరీ సంతకంతో నకిలీ మంజూరు పత్రాలు సృష్టించి పలువురి దగ్గర రూ.20 లక్షలు వసూలు చేసి పారిపోయిన వ్యక్తి

హైదరాబాద్ – బంజారాహిల్స్ ప్రసాద్ లాబ్స్ లో ఆఫీసు బాయ్ గా పని చేస్తున్న నాగరాజు రెడ్డికి, అక్కడే ప్లంబింగ్ పని చేసుకునే కొంతమంది పరిచయమయ్యారు

తనకు రాజకీయ పరిచయాలు ఉన్నాయని, డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్ళు ఇప్పిస్తానని వారి దగ్గర రూ.20 లక్షలు వసూలు చేశాడు

ఫోర్జరీ సంతకంతో నకిలీ మంజూరు పత్రాలు సృష్టించి వారికి అందచేశాడు, నాగరాజు రెడ్డి ఇచ్చిన పత్రాలతో డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్ల వద్దకు వెళ్లగా అవి నకిలీ మంజూరు పత్రాలు అని తెలిసింది

దీంతో నాగరాజు రెడ్డిని నిలదీయగా మరోచోట ఇళ్లు ఇప్పిస్తానని చెప్పి రాత్రికిరాత్రే ఆంధ్రప్రదేశ్ లోని తన సొంత గ్రామానికి పారిపోయాడు నిందితుడు

నాగరాజు రెడ్డిని వెతికి పట్టుకొని తమ డబ్బులు తమకు ఇప్పించాలని వేడుకుంటూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితులు