చోరీకి గురైన సెల్ఫోన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రికవరీ
సాక్షిత న్యూస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఏజీ కాలేజీకి చెందిన ఐశ్వర్య పోగొట్టుకున్న సెల్ ఫోన్ ను పోలీసులు అందజేశారు. ఐశ్వర్య పోగొట్టుకున్న సెల్ ఫోన్ ను పోలీసులు CEIR పోర్టల్ సహాయంతో గుర్తించారు. ఎవరైనా తమ ఫోన్ పోగొట్టుకున్నా లేదా చోరీకి గురైనా వెంటనే సిఈఐఆర్ వైబ్ సైట్ లో ఫిర్యాదు చేయాలని అశ్వారావుపేట ఎస్సై అఖిల సూచించారు. సకాలంలో ఫిర్యాదు చేస్తే ఫోను తిరిగి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆమె తెలిపారు.
