రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ప్రజలే బలం: మంత్రి పొంగులేటి
సాక్షిత : రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి, సంక్షేమ పథకాలు అమలుకు ప్రజలే ఆధారం అని, వారి ఆశీర్వాదాలే ఇందిరమ్మ ప్రభుత్వానికి బలం అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిఅన్నారు. తిరుమలయ్య పాలెం మండలంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఎనిమిదో తరగతి చదువుతున్న 91 మంది బాలికలకు సైకిళ్లు పంపిణీ చేసి, మాట్లాడారు. మరిన్ని అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని తెలిపారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
