రేషన్ డీలర్ల కమిషన్ పెండింగ్ : ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి

A gathering of individuals outside a community building.

Sakshitha news

రేషన్ డీలర్ల కమిషన్ పెండింగ్ : ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి
సాక్షిత : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ కు వినతి పత్రం అందించారు. ఐదు నెలలుగా రేషన్ డీలర్లకు కమిషన్ విడుదల చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని, దీనివల్ల డీలర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సంఘం అధ్యక్షుడు కృష్ణమూర్తి తెలిపారు. కమిషన్ ను విడతల వారిగా కాకుండా ఒకేసారి విడుదల చేసి ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.