SAKSHITHA NEWS

రోడ్డు మరమ్మత్తు పనులను పరిశీలించిన రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఏసీపీ బాలాజీ

శంకర్‌పల్లి: ఆగస్టు 30: శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలోని ఫతేపూర్ బ్రిడ్జి వద్ద జరుగుతున్న రోడ్డు మరమ్మత్తు పనులను శుక్రవారం రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఏసిపి బాలాజీ పరిశీలించారు. అనంతరం ఏసీపీ మాట్లాడుతూ ఆర్ అండ్ బి శాఖ ద్వారా సైడ్ వాల్ పనులు జరుగుతున్నాయి. ఈ పనులు పూర్తికావడానికి మరో 25 రోజుల సమయం పడుతుంది. వాహనదారులకు ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా ఉండుటకు గణేష్ నిమజ్జనం ప్రక్రియ పూర్తయ్య వరకు పనులను నిలిపివేయాలని, ఆర్ అండ్ బి డిఈ ని కోరడం జరిగిందని, వారు దానికి అంగీకరించి మరో రెండు లేయర్స పనులు పెండింగ్ లో ఉన్నందున తాత్కాలికంగా మూడు రోజులు పనులు నిలిపివేస్తామని, గణేష్ నిమర్జనం ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. చేవెళ్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఫతేపూర్ బ్రిడ్జికి ఇరువైపులా వాహనదారులకు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి డిఈ రమేష్, ఆర్ అండ్ బిఏఈ చంద్రశేఖర్, చేవెళ్ల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఎస్ వెంకటేశం, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.


SAKSHITHA NEWS