కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ డివిజన్ (290) నూతన అధ్యక్షులుగా ఎన్నికైన నాగిరెడ్డి మరియు సాయి బాబా నగర్ డివిజన్ (292) అధ్యక్షులుగా ఎన్నికైన ఆకుల హరి కిరణ్ టీపీసీసీ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్బంగా నర్సారెడ్డి భూపతిరెడ్డి నూతన అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలియచేసి, డివిజన్ లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ జెండా ఎగురవేసే విధంగా కృషిచేయాలనీ సూచించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
