ప్రధాన మోడి ప్రమాణస్వీకారం

SAKSHITHA NEWS

Prime Minister Modi takes oath

ప్రధాన మోడి ప్రమాణస్వీకారం

భారీ భద్రతా ఏర్పాట్లు

న్యూ ఢిల్లీ :

భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. రేపు (జూన్ 9న) ఢిల్లీలో జరగనున్న ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్ల జరుగు తున్నాయి.

ఐదు కంపెనీల పారామిలిటరీ బలగాలు, ఎన్ఎస్జీ కమాండోలు డ్రోన్లు, స్నిపర్లతో బహుళ స్థాయి భద్రతను ఏర్పాటు చేశారు. ఇక, రేపు మూడోసారి దేశ ప్రధాని గా మోడీ రాష్ట్రపతి భవన్‌లో ఆదివారం రాత్రి 7. 15 గంటలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

ఇక, ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భారత్‌తో పాటు ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన ప్రముఖులు కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి సార్క్ (సౌత్ ఏషియన్ ఆర్గనైజేషన్ ఫర్ రీజినల్ కో-ఆపరేషన్) దేశాల అతిథులను ఆహ్వానించారు. అలాగే రేపు జరగబోయే ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చే అతిథులు హోటల్‌కు వెళ్లే మార్గం పూర్తిగా సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు.

ఇదే కాకుండా పొరుగు దేశాలైన భూటాన్, మాల్దీవులు, శ్రీలంక, నేపాల్, మారిషస్, సీషెల్స్ దేశాల నేతలు మోడీ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరవుతున్నారు.

ప్రత్యేక అతిధులు..:

మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్న కార్యక్రమానికి స్పెషల్ గెస్టులు రానున్నారు. నూతన పార్లమెంట్‌ నిర్మాణంలో భాగస్వాములైన శ్రామికులు, ట్రాన్సజెండర్‌లు, పారిశుద్ధ్య కార్మికులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్లు తెలిపారు. అలాగే భారత దేశాభివృద్ధికి తోడ్పడుతున్న వీరందరినీ మోదీ తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఇప్పటికే వివిధ దేశాధినేతలు తమకు ఆహ్వానాలు అందినట్లుగా ప్రకటించారు. కూటమి నాయకులు, విదేశీ నేతలు, ప్రతిపక్ష సభ్యులు, సినీ, క్రీడారంగ ప్రముఖులు, అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలతో సహా మరికొంత మందిని ముఖ్య అతిథులుగా ఆహ్వానించనున్నట్లుగా అధికారులు తెలిపారు. ఈ జాబితాలో పలువురు ట్రాన్స్‌జెండర్లు, కొత్త పార్లమెంటు భవన నిర్మాణానికి పని చేసిన శ్రామికులు, పారిశుద్ధ్య కార్మికులు, వందే భారత్ రైళ్లు వంటి కీలక ప్రాజుక్టుల్లో పని చేసిన వారికి అవకాశం కల్పించినట్లు చెప్పారు.

‘ప్రధానమంత్రి మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత రాజకీయాల్లో చాలా మార్పులు చోటుచేసు కొన్నాయి. బలమైన దేశ నిర్మాణంలో పాలుపంచుకున్న ప్రతిఒక్కరి సహకారాన్ని ఆయన గౌరవిస్తారు. వీఐపీలు, వీవీఐపీలకు మాత్రమే ఆహ్వానాలు పంపే రోజులు పోయాయి. మా పీఎం అట్టడుగు వర్గాల్లో వారిని కూడా వీఐపీలుగానే చూస్తారు” అని కూటమి వర్గాలు తెలిపాయి.

WhatsApp Image 2024 06 08 at 12.52.13

SAKSHITHA NEWS

sakshitha

Related Posts

tamil nadu తమిళనాడు బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్య?

SAKSHITHA NEWS

SAKSHITHA NEWStamil nadu తమిళనాడు బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్య?తమిళనాడు రాజధాని చెన్నైలో దారుణ సంఘటన వెలుగుచూసింది. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్మ్ స్ట్రాంగ్, రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. సిటీలోని సెంబీయం ప్రాం తంలో ఉన్న తన…


SAKSHITHA NEWS

august ఆగస్టులోపు మోదీ ప్రభుత్వం కూలిపోవచ్చు

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSaugust ఆగస్టులోపు మోదీ ప్రభుత్వం కూలిపోవచ్చు: లాలూ RJD చీఫ్, బిహార్ మాజీ CM లాలూ ప్రసాద్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టులోపు కేంద్రంలో NDA ప్రభుత్వం కూలిపోవచ్చన్నారు. ‘మోదీ ప్రభుత్వం బలహీనంగా ఉంది. ఏ సమయంలోనైనా ఎన్నికలు…


SAKSHITHA NEWS

You Missed

uttam బాలెంల ఘటనపై స్పందించిన మంత్రి ఉత్తంమ్ కుమార్ రెడ్డి

uttam బాలెంల ఘటనపై స్పందించిన మంత్రి ఉత్తంమ్ కుమార్ రెడ్డి

youth యువకులకు, సామాన్య ప్రజలకు తోడు గా ఉంటాం

youth యువకులకు, సామాన్య ప్రజలకు తోడు గా ఉంటాం

varla వర్ల కుమార్ రాజా గెలుపుతో పామర్రు నియోజకవర్గానికి మహర్దశ

varla వర్ల కుమార్ రాజా గెలుపుతో పామర్రు నియోజకవర్గానికి మహర్దశ

tamil nadu తమిళనాడు బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్య?

tamil nadu తమిళనాడు బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్య?

godavarikhani గోదావరిఖని కాలనీలలో పోలీసుల తనిఖీలు

godavarikhani గోదావరిఖని కాలనీలలో పోలీసుల తనిఖీలు

constitution రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ పార్టీ ఫిరాయింపులను

constitution రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ పార్టీ ఫిరాయింపులను

You cannot copy content of this page