SAKSHITHA NEWS

ఓటును వినియోగించుకున్న ఓటర్లు
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

సాక్షిత :కోవూరు నియోజకవర్గంలో చాలా ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది, 324 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి ఓటు హక్కును వినియోగించడానికి భారీ ఎత్తున వృద్ధులు, వికలాంగులు, మహిళలు, కొత్తగా ఓటు వచ్చిన 18 ఏళ్ల యువత కూడా ఓటుకు ప్రాధాన్యత ఇచ్చారు, స్వచ్ఛందంగా వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకున్నారు, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు ప్రశాంతమైన వాతావరణంలో ఓటింగ్ జరిగింది సాయంత్రం 6 గంటలకు ముగిసింది, లోపల ఉన్న వారికి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించిన అధికారులు, భారీ భద్రతా నడుమ నమూనాలకు సీల్ వేసి డీకే డబ్ల్యూ డబ్ల్యూకి తరలించిన అధికారులు, ప్రజలు ఎవరికి పట్టం కడతారనేది జూన్ 4 దాకా వేచి చూడాల్సిందే.


SAKSHITHA NEWS