SAKSHITHA NEWS

గుంటూరులో కార్డన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు

గుంటూరు నగరంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎలాంటి పత్రాలు లేని 18 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నగరంలో బైక్ దొంగతనాలు జరుగుతున్నాయని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తూ బైక్స్ దొంగతనం చేస్తున్నారని తెలిపారు. గంజాయి అమ్మడం, త్రాగే వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు


SAKSHITHA NEWS