పోచమ్మ తల్లి దీవెనలతో దేవాలయ నిర్మాణ పనులు బ్రహ్మాండంగా సాగాలి : పోచమ్మ దేవాలయం పునః నిర్మాణ పనుల శంకుస్థాపనలో బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ….
126 – జగద్గిరిగుట్ట డివిజన్ బీరప్ప నగర్ లోని పోచమ్మ దేవాలయం పునః నిర్మాణ పనులల్లో భాగంగా బిఆర్ఎస్ ఎల్పీ విప్ ఎమ్మెల్యే కెపి వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై దేవాలయ పునః నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. పోచమ్మ అమ్మవారి దయతో దేవాలయ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి కావాలని ఆకాంక్షించారు. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లేనని, అన్న దయతో ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జగన్, డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, బీరప్ప నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి పాపిరెడ్డి, ఉపాధ్యక్షులు శేఖర్, సత్యనారాయణ యాదవ్, కోశాధికారి సుధాకర్, శ్రావణ్ కుమార్, కార్యనిర్వాహ కార్యదర్శిలు అనంతరెడ్డి, రామచంద్రయ్య, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు ఉపేందర్ రెడ్డి, గోపాల్ రావు, సంపత్, వెంకట్ రెడ్డి, వెంకటెష్, హరినాథ్ రావు, సుధాకర్, బిఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆజమ్, మల్లేష్ గౌడ్, పాపిరెడ్డి, బండ మహేందర్, మెట్ల శ్రీను, చారి, విఠల్, నర్సింహా రెడ్డి, బ్రహ్మానంద చారి, సాజిద్, విఘ్నేష్, మహిళా నాయకురాలు ఇందిరా గౌడ్, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.
