మౌళిక వసతుల కల్పనలో కుత్బుల్లాపూర్ ను ఆదర్శవంతం

Sakshitha news

మౌళిక వసతుల కల్పనలో కుత్బుల్లాపూర్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా: బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …..

126 – జగద్గిరిగుట్ట డివిజన్ పరిధి బీరప్ప నగర్ టెంపుల్ రోడ్, జగద్గిరి నగర్ రోడ్ నెం.1 కాలనీలలో సుమారు 25.00 లక్షల రూపాయలతో చేపట్టనున్న సిసి రోడ్డు పనులకు బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. గత 12 ఏళ్ల కాలంలో కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలో కోట్లాది రూపాయల నిధులతో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేశామని, రాబోయే రోజుల్లో కూడా కుత్బుల్లాపూర్ నియోజక వర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని, అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం అవసరమన్నారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జగన్, డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, బీరప్ప నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి పాపిరెడ్డి, ఉపాధ్యక్షులు శేఖర్, సత్యనారాయణ యాదవ్, కోశాధికారి సుధాకర్, శ్రావణ్ కుమార్, కార్యనిర్వాహ కార్యదర్శిలు అనంతరెడ్డి, రామచంద్రయ్య, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు ఉపేందర్ రెడ్డి, గోపాల్ రావు, సంపత్, వెంకట్ రెడ్డి, వెంకటెష్, హరినాథ్ రావు, సుధాకర్, బిఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆజమ్, మల్లేష్ గౌడ్, పాపిరెడ్డి, బండ మహేందర్, మెట్ల శ్రీను, చారి, విఠల్, నర్సింహా రెడ్డి, బ్రహ్మానంద చారి, సాజిద్, విఘ్నేష్, మహిళా నాయకురాలు ఇందిరా గౌడ్, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.