దేశ ప్రజలు కెసిఆర్ నాయకత్వాన్ని కోరుతున్నారు

దేశ ప్రజలు కెసిఆర్ నాయకత్వాన్ని కోరుతున్నారు

SAKSHITHA NEWS

హైదరాబాద్ :
బీఆర్‌ఎస్‌ పార్టీలోకి మహారాష్ట్ర నుంచి చేరికల జోరు కొనసాగుతున్నది. నాందేడు కాందార్ లోహ వంటి తెలంగాణ సరిహద్దు ప్రాంతాల నుంచి మొదలైన ఈ చేరికల పర్వం, మధ్య మహారాష్ట్రకు చేరుకున్నది. ఈ మేరకు దిన దిన ప్రవర్ధమానమౌతు, మహా రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ విస్తరిస్తూ మరాఠా ప్రజల హృదయాల్లో పాగా వేసుకొంటున్నది.

జాతీయస్థాయిలో అధినేత సిఎం కేసీఆర్ నాయకత్వం పట్ల ప్రజాదరణ పెరుగుతున్నదనడానికి, మహారాష్ట్ర లో కొనసాగుతున్న ఈ చేరికల పరంపర అద్దం పడుతుంది మహారాష్ట్రలోని పల్లె పల్లెకు విస్తరిస్తామన్న బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ లక్ష్యం త్వరలోనే నెరవేరానున్నది

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకులు సోమవారం హైదరాబాద్ లో బిఆర్ఎస్ అధినేత సిఎం కేసీఆర్ సమక్షంలో గులాబి కండువాలు కప్పుకొని బిఆర్ఎస్ పార్టీలో చేరారు.

వారిలో .. మాజీ ఎమ్మెల్యే అన్నా సాహెబ్ మానె, సంతోష్ మానె, ప్రశాంత్ పాటిల్ ఉన్నారు.

ఔరంగాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ శివసేన లీడర్, రెండు సార్లు ఎంఎల్ఏ గా పని చేసిన సీనియర్ నేత అన్నా సాహెబ్ మానె.. బీఆర్ఎస్ లో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది. వారికి గులాబీ కండువా కప్పి అధినేత పార్టీలోకి ఆహ్వానించారు .
వారితో పాటు, గంగాపూర్ నియోజక వర్గానికి చెందిన సంతోష్ కుమార్, ఔరంగాబాద్ ఎన్ సి పి యూత్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్న ప్రశాంత్ పాటిల్ కూడా నేడు బిఆర్ఎస్ లో చేరారు.
సంతోష్ కుమార్ ఎన్ సి పి పార్టీ తరపున గంగాపూర్ నుంచి పోటీ చేయగా, ఆయన 82 వేల ఓట్లు సాధించారు.
సోమవారం బి ఆర్ ఎస్ లో చేరిన నేతలు ఔరంగాబాద్ జిల్లా వ్యాప్తంగా రాజకీయంగా పట్టు, ప్రజల్లో ఆదరణవున్న నేతలు కావడం గమనార్హం.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే విప్ బాల్క సుమన్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS