సముద్ర తీరంలో ఉండే ప్రజలు జాగ్రత్తగా ఉండాలి ఆవుల వాసు
సాక్షిత : తుఫాను హెచ్చరికల నేపథ్యంలో కోవూరు నియోజకవర్గ ప్రజలు, రామతీర్థం సముద్ర తీరంలో ఉండే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సూచనలతో లోతట్టు ప్రాంతాలను గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.ముందు జాగ్రత్తగా రామతీర్థంలలో మత్స్యకార సోదరులందరూ అప్రమత్తంగా ఉండాలని సముద్ర లో వేటకు గాని అటు పక్కకు గాని వెళ్లదు అని మీకు ఎటువంటి ఏ ఇబ్బంది ఉన్నా మమ్మలని, అధికారులని, వెంటనే సంప్రదించాలని..జిల్లా కలెక్టరేట్ లో అధికారులు 08612331261,7995576699 నెంబర్లతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారని, తెలియజేసిన టిడిపి ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకార కులాల సంక్షేమ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆవుల వాసు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
