భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ప్రసన్నకుమార్ రెడ్డి
సాక్షిత ::వాతావరణ శాఖ రాబోవు మూడు రోజులు జిల్లాకు భారీ వర్ష సూచనల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే తప్ప బయటకు రాకూడదని, రైతులు పంట పొలాలలో చెట్ల కింద ఉండరాదని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తెలియజేసినారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి తమ సహాయ సహకారాలు అందించాలని కోరినారు
