SAKSHITHA NEWS

ప్రభుత్వ పాఠశాలల్లో గంటపాటు స్పోర్ట్స్ పీరియడ్

హైదరాబాద్ :
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు ప్రతిరోజూ గంటపాటు క్రీడల పీరియడ్ ఉండేలా విద్యా శాఖకు ఆదేశాలిస్తామని శాసనమండలిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

గ్రామాల్లోని క్రీడాప్రాంగ ణాలను వినియోగంలోకి తెచ్చి, ఆగస్ట్ 15, జనవరి 26న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆటలపోటీలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.

క్రీడలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలని, నిత్యం గంట స్పోర్ట్స్ పీరియడ్ పెట్టాలని ఎమ్మెల్సీలు ఆయన దృష్టికి తేవడంతో ఈ ప్రకటన చేశారు…


SAKSHITHA NEWS