ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటలు సేవలందిస్తూ ప్రసవాల సంఖ్యను పెంచాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్…….. ఆదర్శ సురభి
సాక్షిత వనపర్తి
వనపర్తి జిల్లా
ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెంచడంతో పాటు 24 గంటలు సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి వైద్యాధికారులను ఆదేశించారు.
ఉదయం వనపర్తి జిల్లా మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఆసుపత్రిలో ఉన్న మౌలిక సదుపాయాలు, వైద్య సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు.
చిన్న పిల్లల వార్డు, ప్రసూతి వార్డు, శస్త్ర చికిత్సల వార్డు, ఎస్ ఎన్.సి. యు వార్డులను పరిశీలించారు.
ఆసుపత్రిలో ఉన్న బెడ్ ల వివరాలు, వివిధ రకాలైన రిజిస్టర్లను పరిశీలించారు. రోజుకు ఎన్ని ఒ.పి లు నమోదు అవుతున్నాయి, ప్రసవాలు ఎన్ని, ఇతర ఆసుపత్రులకు రేఫర్ చేసిన రిజిస్టరును పరిశీలించారు.
24 గంటలు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలసి, ప్రైవేటుకు కాకుండా ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవాలు అధికంగా జరిపించే విధంగా కృషి చేయాలని ఆదేశించారు.
అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, ఆర్.యం.ఒ
డా. బంగారయ్య, గైనకాలజిస్ట్ డిపార్ట్మెంట్ హెడ్ డా. అరుణ కుమారి, వైద్య సిబ్బంది తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటలు సేవలందిస్తూ ప్రసవాల సంఖ్య
Related Posts
హైడ్రా నెక్ట్స్ టార్గెట్ హుస్సేన్సాగర్లో నిర్మాణాలేనా..
SAKSHITHA NEWS హైడ్రా నెక్ట్స్ టార్గెట్ హుస్సేన్సాగర్లో నిర్మాణాలేనా.. హైదరాబాద్, చెరువులపై అక్రమ నిర్మాణాల కూల్చివేతే లక్ష్యంగా హైడ్రా దూసుకెళ్తోంది. రాష్ట్రంలో చెరువులు, నాళాలపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసే పనిలో వేగం పెంచింది హైడ్రా. ఇప్పటికే అనేక అక్రమ నిర్మాణాలు…
రెడ్స్టోన్ హోటల్లో నర్స్ అనుమానాస్పద మృతి కేసును చేధించిన పోలీసులు
SAKSHITHA NEWS రెడ్స్టోన్ హోటల్లో నర్స్ అనుమానాస్పద మృతి కేసును చేధించిన పోలీసులు హైదరాబాద్, నగరంలోని గచ్చిబౌలిలో స్టాఫ్ నర్స్ శృతి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు చేధించారు. రెండు రోజుల క్రితం గచ్చిబౌలిలోని రెడ్ స్టోన్ ఓయో హోటల్ గదిలో…