SAKSHITHA NEWS

అనుచర సిద్ధాంతం కాదు సహచర సిద్ధాంతం బిజెపి పార్టీతో మాత్రమే సాధ్యం – బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు ఘట్కేసర్ మాజీ ఎంపిపి ఏనుగు సుదర్శన్ రెడ్డి

సాక్షిత : భారతదేశం భద్రతతో కూడిన సుపరిపాలన ద్వారా ప్రపంచ నాయకత్వ స్థానం వైపు వడివడిగా అడుగుల వేయడంలో భారతీయ జనతా పార్టీ చేస్తున్న నీతి వంతమైన పాలనకు దేశంలో ఉన్న ప్రజలు బుజం బుజం కలిపి సభ్యులుగా చేరుతున్నారు అని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు ఘట్కేసర్ మాజీ ఎంపిపి ఏనుగు సుదర్శన్ రెడ్డి అన్నారు…. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అధ్యక్షులు కమల్ ఆధ్వర్యంలో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించి నేటి సభ్యుడే రేపటి రోజు పార్టీ పనితీరు నిశితంగా గమనించి క్రియాశీల సభ్యులుగా అటుతరువాత పార్టీ నాయకులుగా ప్రజల్లో పార్టీ కొరకు అహరహం శ్రమించి పనిచేసి అభ్యున్నతికి కృషి చేస్తారని కావున మనం తప్పక పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి సభ్యత్వాలు పెద్ద ఎత్తున చేయించేలా సమన్వయంతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు…..


SAKSHITHA NEWS