జులై 1 నుంచి కొత్త న్యాయ చట్టాలు
కేంద్రం రూపొందించిన కొత్త నేర న్యాయ చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం జులై 1 నుంచి అమలులోకి రానున్నాయి. దీంతో బాధితులు పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా కంప్లైంట్ చేయవచ్చు. జీరో ఎప్ఐఆర్ ప్రకారం ఏ వ్యక్తి అయినా పీఎస్ పరిధితో సంబంధం లేకుండా ఏ పీఎస్లోనైనా ఫిర్యాదు చేయొచ్చు. మహిళలు, చిన్నారులపై నేరాల దర్యాప్తు 2నెలల్లో పూర్తి చేయాలి.
![జులై 1 నుంచి కొత్త న్యాయ చట్టాలు 2 జులై 1 నుంచి కొత్త న్యాయ చట్టాలు](https://sakshithanews.com/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-27-at-10.06.38.jpeg)