SAKSHITHA NEWS

నాగార్జున సాగర్ ఎడమ కాల్వ సాగు నీరు విడుదల

హైదరాబాద్:
శ్రీశైలం డ్యామ్ గేట్లు తెరిచి నీటిని విడుదల చేయడంతో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది.

గురువారం సాయంత్రం ఆరు గంటల సమయానికి సాగర్‌ పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలకు గాను 182.95 టీఎంసీలకు చేరుకుంది.

ఈ నేపథ్యంలో నాగార్జున సాగర్ ఎడమకాల్వకు నీటిని విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ క్రమంలోనే ఇవాళ సాయంత్రం 4 గంటలకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు నీటిని విడుదల చేయనున్నారు..


SAKSHITHA NEWS