సచివాలయాలను ఆకస్మికంగా తనికి చేసిన మున్సిపల్ కమిషనర్ పి. హరిబాబు
సమయపాలన పాటించాలని సచివాలయ ఉద్యోగులకు సూచనలు
వాటర్ ట్యాక్స్,ఇంటి పన్నుల వసూలు వేగ వంతం చేయండి
చిలకలూరిపేట : స్థానిక పురపాలక సంఘం పరిధిలోని సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు 15 వ సచివాలయంలో డ్యూటీ చార్టును ,అటెండెన్స్ బుక్ ను పరిశీలించి ప్రభుత్వ ఆదేశించిన సర్వే పనులను త్వరతగతిన పూర్తి చేయాలని అదేవిధంగా వాటర్ ట్యాక్స్ వసూలు, ఇంటి పన్నులు వసూలు కూడా వేగవంతం చేయాలని సూచనలు చేశారు అదే విధముగా ప్రజా ప్రతినిధులు ప్రజల నుంచి సచివాలయాలలో అందు బాటులో ఉండటం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి అని సచివాలయాల సిబ్బంది సమయ పాలన పాటించాలని సర్వేల పేరుతో కార్యాలయంలో అందుబాటులో లేక పోతే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
