SAKSHITHA NEWS

ఘనంగా ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు
డివిజన్ లోని మహిళలకు చీరలు పంపిణీ చేసిన.. రాగం సుజాత యాదవ్ *
జాగృతి ఆధ్వర్యంలో వేడుకలు
దేశ విదేశాల్లోను అంబరాన్నంటిన జన్మదిన వేడుకలు


సాక్షిత శేరిలింగంపల్లి: తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డ్ చైర్ పర్సన్ శ్రీమతి రాగం సుజాత యాదవ్ , శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో కార్పొరేటర్ వార్డ్ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. అనంతరం వార్డ్ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి కేక్ ను కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా డివిజన్ లోని మహిళలకు రంగురంగుల చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు వీరేశం గౌడ్, రాష్ట్ర యువజన నాయకులు రాగం అనిరుధ్ యాదవ్, స్వరూప, గోపినగర్ బస్తీ అధ్యక్షులు గోపాల్ యాదవ్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, వార్డ్ మెంబర్ శ్రీకళ, పర్వీన్ బేగం, సౌజన్య, భాగ్యలక్ష్మి, సుధారాణి, జయ, నిరూప, రాములమ్మ, సుభాష్ రాథోడ్, సత్తర్, నయీమ్, సాయినందన్, శ్రీశైలం, హరీష్, శ్యామ్, రోజా, కళ్యాణి, దీవెన, కుమారి, లక్ష్మి, శశికళ, సుజాత, గౌసియా, డివిజన్ లోని సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, శ్రేయోభిలాషులు, తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.


SAKSHITHA NEWS