SAKSHITHA NEWS

ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ని కలసిన ఎమ్మెల్యే కృష్ణప్రసాదు .

ఎన్టీఆర్ జిల్లా, అమరావతి,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు సాయంత్రం అమరావతిలోని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నిమ్మల రామానాయుడు కి శాలువాలు కప్పి ఘనంగా సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. మైలవరం నియోజకవర్గ పరిధిలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టు జోన్-3లో ఎగువ నుంచి నీటిని దిగువకు విడుదల చేయాలని కోరారు. మైలవరం నియోజకవర్గ పరిధిలో సాగునీటి సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక ఎన్డీఏ కూటమి నేతలు, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS