SAKSHITHA NEWS

మౌలిక వసతులను కల్పనను కృషిచేస్తా: ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ ….

సాక్షిత : కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద బాచుపల్లి కి చెందిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారులు దాదాపు యాభై మంది ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ ని కలిసి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద నెలకొని ఉన్న భూగర్భ డ్రైనేజీ, మంచినీటి సౌకర్యం, ప్రహరీ గోడ నిర్మాణం, కరెంటు సమస్యలను తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అధికారులతో ఫోన్లో మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు మౌలిక వసతులైన భూగర్భ డ్రైనేజీ, మంచినీటి సౌకర్యం, కరెంటు వసతులను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు నదీమ్ రాయ్, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులు అశోక్, దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024 08 21 at 15.22.38

SAKSHITHA NEWS