సూర్యాపేటలో సమాచార హక్కు సాధన కమిటీ సమావేశం

Sakshitha news

సూర్యాపేటలో సమాచార హక్కు సాధన కమిటీ సమావేశం

సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ బాలాజీ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సూర్యపేట,నల్లగొండ,ఖమ్మం జిల్లాల ఆర్.టి.ఐ. సమాచార హక్కు చట్టం సాధన కమిటీ సమావేశానికి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు చంటి ముదిరాజ్,జాతీయ ప్రధాన కార్యదర్శి మల్లం వెంకటేశం గౌడ్,రాష్ట్ర అధ్యక్షురాలు సూర స్రవంతి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్.దిలీప్ రావు,కట్టే కోల గోపీనాథ్,వారు ముఖ్య అతిథిలుగా పాల్గొని మాట్లాడారు.సమాచార హక్కు చట్టం సాధన కమిటీతో ఆర్.టి.ఐ కార్యకర్తలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సభ్యులంతా సమిష్టిగా పనిచేసుకుంటూ విద్య, వైద్య సంస్థలలో ప్రభుత్వ కార్యాలయాలలో ఆర్ ర్టి ఐ వేసి సమాచారాన్ని సేకరించాలన్నారు.అప్పుడే మీకు పేరు గుర్తింపు ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో షేక్ జానీ,సిద్ధం వెంకన్న,గోపి,కట్టేకోల పరమేశ్వర్,పాలకూరి బుచ్చయ్య, కట్టేకోల నర్సయ్య,నీలం వెంకట మధు, కట్టేకోలా గోపినాథ్,పాణి,రవి,సాయి కిరణ్,సీతా రామరెడ్డి,శ్రీనివాస్,వెంకటేశ్వర్లు,అశ్వాల శివ కుమార్,పెరమల్ల లక్ష్మయ్య,మాజీ ముఖేష్,రాఘవ,చిన్న సైదులు,కేతోజు వినోద్ కుమార్,కంశెట్టి గోపి,శ్రీ రామ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.