SAKSHITHA NEWS

వరుస చోరీలతో బెంబేలెత్తుతున్న మంగళగిరి పట్టణం


\ సాక్షిత గుంటూరు జిల్లా మంగళగిరి:
వరుస చోరీలతో బెంబేలెత్తుతున్న మంగళగిరి పట్టణం.
మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో రోజురోజుకు పెరుగుతున్న దోపిడీలు, దొంగతనాలు,చైన్ స్నాచింగ్ లు.
మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ కు ఎటు చూసిన 2 కిలో మీటర్ ల లోపే ఉన్న వ్యవధిలో ఒక్క రోజు రాత్రే పట్టణ నడి బొడ్డులో మూడు చోరీలు జరగటం కొసమెరుపు…
రాత్రి అభిరుచి హోటల్ ప్రక్కన వీధిలో ఓ ఇంట్లో చోరీ.
తాళం వేసి తిరుపతి వెళ్ళిన ఇంటి యజమాని, కుటుంబ సభ్యులు..
బీరువాలో ఇరవై గ్రాముల బంగారం. వెండి ,నగదు దోచుకెళ్ళిన దొంగలు.


ఇళ్లలో ఎవరు చేయలేని సమయాన్ని చూసి తాళ్ళం వేసిన ఇళ్ళే లక్స్యంగా చేసీకొని పట్టణంలో కొంత కాలంగా చోరీలకు పాల్పడుతున్నారు తాజాగా మంగళగిరి పట్టణంలోని నగరపాలక సంస్థ ఎదురు వీధిలో అభిరుచి హోటల్ వెనక ఉన్నటువంటి ఓ నివాసంలో తాళాలు వేచి వారు తిరుపతి వెళ్ళారు. ఇంటిలోకి చొరబడి తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడి బీరువా లోపల లాకర్లను సైతం ఓపెన్ చేసి దానిలో ఉన్నటువంటి 20 గ్రాముల బంగారం 500 గ్రాములు వెండి, మూడు చేతి గడియారాలు 5000 రూపాయల నగదు దోచుకెళ్ళారు. ఇవి చాలక ఇంటి లోపల ముందు గదిలో పెట్టిన ద్విచక్ర వాహనమును సైతం తీసుకెళ్ళెందుకు విశ్వ ప్రయత్నం చేసారు. సాధ్యంకాక ఆ బండిని కొద్ది దూరం తీసుకెళ్ళి అక్కడే వదిలేసారు.దొచుకెళ్ళిన వస్తువుల విలవ సుమారు రెండు లక్షల రూపాయలు ఉంటుందని తెలియజేస్తున్న బాదితులు.


SAKSHITHA NEWS