SAKSHITHA NEWS

TREES కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రగతి నగర్ అంబిర్ లేక్ వద్ద అంబీర్ లేక్ వాకర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన
వనమహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , అంబీర్ లేక్ వాకర్స్ తో కలిసి మొక్కలను నాటారు. ఈ సందర్బంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ భూమిపై చెట్లు విస్తృత స్థాయిలో పెంచినప్పుడే సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండి రైతులు, ప్రజలంతా ఆరోగ్యంగా ఉండటంతో పాటు వాతావరణంలోని కాలుష్యాన్ని తగ్గించవచ్చన్నారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సురేష్ రెడ్డి, నాగ వెంకట సత్యవాణి, సీనియర్ నాయకులు ఆవుల జగన్ యాదవ్, నాయకులు మంజునాథ్, దశరథ్, 191 ఎన్టీఆర్ నగర్ కాలనీ అధ్యక్షులు కృష్ణ,అంబీర్ లేక్ వాకర్స్ సాంబాశివా రావు, అశోక్ , ప్రశాంత్, సామ్రాజ లక్ష్మి, శ్రీ లక్ష్మి, లేక్ వ్యూ నివాసులు, స్థానిక వాసులు, పిల్లలు, తదితరులు పాల్గొన్నారు.

TREES

SAKSHITHA NEWS