Legislative Council Deputy Chairman Banda Prakash Mudiraj pays tribute to Thalasani Shankar Yadav
మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు తలసాని శంకర్ యాదవ్ కు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్ నివాళులు అర్పించారు. శంకర్ యాదవ్ సోమవారం తెల్లవారుజామున మరణించగా, విషయం తెలుసుకున్న బండ ప్రకాష్ ముదిరాజ్ శంకర్ యాదవ్ నివాసానికి చేరుకొని పార్ధీవ దేహాం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం తలసాని సాయి కిరణ్ యాదవ్, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలిపారు. ఆయన వెంట మాజీ స్పోర్ట్స్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి, ఖైరతాబాద్ BRS నాయకులు మన్నె గోవర్ధన్ రెడ్డి తదితరులు ఉన్నారు
![తలసాని శంకర్ యాదవ్ కు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్ నివాళులు 2 WhatsApp Image 2024 06 10 at 17.47.00](https://sakshithanews.com/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-10-at-17.47.00-1024x768.jpeg)