SAKSHITHA NEWS

కాజీపేట రైల్వే జంక్షన్ ను డివిజన్ గా అప్ గ్రేడ్ చేయాలి…..

నష్కల్ నుండి చింతలపల్లి గూడ్స్ లైన్ పై పునరాలోచించాలి….

కాజీపేట రైల్వే హాస్పిటల్ ను మల్టిస్పెషాలిటీ హాస్పిటల్ గా అప్ గ్రేడ్ చేయాలి…..

రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే సమావేశంలో పాల్గొన్న ఎంపీ డా. కడియం కావ్య….

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రైల్వే పెండింగ్ ప్రాజెక్టుల పనులు పూర్తి చేయాలని కోరిన ఎంపీ డా. కడియం కావ్య….

సికింద్రాబాద్ లోని రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని తెలంగాణ, కర్ణాటక ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వే జిఎం అరుణ్ కుమార్ జైన్ నిర్వహించిన సమావేశంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో చేపట్టాల్సిన కొత్త రైల్వే లైన్లు, రైల్వే అండర్ బ్రిడ్జ్ లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లు, లెవల్ క్రాసింగ్ గేట్ లు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, కొత్త ప్రాజెక్టులు తదితర అంశాలను ఎంపీ రైల్వే అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.

ఈ సందర్బంగా ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ దక్షిణ మధ్య రైల్వేకు ముఖ ద్వారంగా ఉన్న కాజీపేట రైల్వే జంక్షన్ ను డివిజన్ గా అప్ గ్రేడ్ చేయాలని, ఆ దిశగా రైల్వే బోర్డు మరియు రైల్వే మంత్రి కి ప్రతిపాదనలు పంపాలని కోరారు. కొత్తగా చేపట్టనున్న నష్కల్ టు చింతలపల్లి గూడ్స్ రైల్ లైన్ నిర్మాణంపై పునరాలోచన చేయాలని అన్నారు. కొత్త లైన్ ప్రతిపాదనలపై స్థానిక ప్రజా ప్రతినిధులను, రైతులను సంప్రదించకుండా నిర్ణయం తీసుకున్నారని దింతో స్థానిక రైతుల నుండి వ్యతిరేకత వస్తుందని వివరించారు. కాజీపేట జంక్షన్ లోని హాస్పిటల్ లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని అన్నారు. వెంటనే హాస్పిటల్ లో సిబ్బంది నియమాకాన్ని చేపట్టడంతో పాటు మహిళా డాక్టర్ ను ఆపాయింట్ చేయాలని కోరారు. మ్యానిఫాక్చర్ యూనిట్ ను కోచ్ ఫ్యాక్టరీగా అప్ గ్రేడ్ చేసినందుకు రైల్వే శాఖకు ఎంపీ ధన్యవాదాలు తెలిపారు. ఫాతిమా నగర్ ROB నిర్మాణ పనులు నత్త నడకన నడుస్తున్నాయని, కావున వెంటనే ROB నిర్మాణ పనులను పూర్తి చేయాలని అన్నారు. కాజీపేట జంక్షన్ లో సరిపడా ప్లాట్ ఫామ్స్ లేనందున రైళ్ళ రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని కావున ప్లాట్ ఫామ్ లను పెంచాలని కోరారు. కాజీపేట జంక్షన్ ఆవరణలో బస్టాండ్ లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కావున బస్టాండ్ ఏర్పాటు స్థలం కేటాయించాలని కోరారు.

ఎంపీ ప్రస్థావించిన అంశాలపై సానుకూలంగా స్పందించిన రైల్వే అధికారులు రానున్న బోర్డు మీటింగ్ లో పై అంశాలను బోర్డు దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు.


SAKSHITHA NEWS