SAKSHITHA NEWS

చిట్యాల (సాక్షిత ప్రతినిధి)

చిట్యాల మండలం పెద్ద కాపర్తి గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర స్వాతంత్ర సమరయోధుడు రాజకీయ దురంధరుడు గొప్ప సంఘసంస్కర్త భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.


ఈ సందర్భంగా సర్పంచ్ మర్రి జలంధర్ రెడ్డి జగ్జీవన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నూతి సత్య శ్రీ వెంకటేశం, ఎంఎస్ఎఫ్ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి చేకూరి గణేష్, వార్డు సభ్యులు గుండెపురి చంద్రయ్య,సిలివేరు సుగుణమ్మ, వివిధ పార్టీల నాయకులు ఏర్పుల సైదులు మాదిగ, పొట్లపల్లి నరసింహ, నీలకంఠం నరేష్, ఆవుల జానయ్య, సిలువేరు నరసింహ, పున్న విష్ణు, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS